తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్,

-

తెలంగాణా రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒరిస్సా తీరము & పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా – పశ్చిమ బెంగాల్ తీరములో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది.

ఈ రోజు మరియు రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. నిర్మల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. సూర్యాపేట, యాదాద్రి వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.ఇక మిగతా 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news