Janasena-BJP : జనసేన-బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారు

-

Janasena-BJP :  జనసేన-బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి.. తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై చర్చించారు.

The alliance between the Janasena-BJP parties has been finalized

ఈ తరుణంలోనే.. 12 సీట్లు జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాలోనే జనసేన బలంగా ఉందని.. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లు అడిగారట పవన్‌ కళ్యాణ్. ఇక చర్చలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం నుంచి వెళ్లిపోయారు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు. కాగా..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం.. జనసేన పార్టీ.. టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది.కానీ టీడీపీ పార్టీ.. తెలంగాణ పోటీలోనే లేదు.

Read more RELATED
Recommended to you

Latest news