పార్టీ సమిష్టి నాయకత్వం చూస్తే గర్వంగా ఉంది – థాక్రే

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా ముగియడం పట్ల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో భట్టి విక్రమార్కని సన్మానించనున్నారు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ.

ఈ నేపథ్యంలో భట్టికి శుభాకాంక్షలు తెలుపుతూ మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భట్టి 1350 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని తెలిపారు. కాంగ్రెస్ సమిష్టి నాయకత్వాన్ని చూసి తాము గర్వపడుతున్నట్లు వివరించారు. అలాగే తెలంగాణలోని పలువురు సీనియర్ నాయకులు పార్టీలో చేరబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news