బాలాపూర్‌ గణేష్‌ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్‌ నేత ఇంట్లో సోదాలు..

-

 

హైదరాబాద్‌లో ఐటీ దాడుల కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకురాలు, బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. చిగురింత పారిజాత నరసింహారెడ్డితో పాటు.. బాలాపూర్‌ గణేష్‌ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్‌ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.

The house of the BRS leader who got Balapur Ganesh Laddu was searched

మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ తెల్లవారుజామునే నగరంలోని బడంగ్పేట్ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై ఏకంగా 20 మంది ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. ఆమెకు సంబంధించిన బంధువుల నివాసాలు, ఇతరత్రా చోట్ల సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో పారిజాత మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించారు.

Read more RELATED
Recommended to you

Latest news