ఘట్కేసర్ లో కిడ్నాప్ కి గురైన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

-

ఘట్కేసర్ లోని ఎస్డబ్ల్యూ కాలనీలో కిడ్నాప్ కి గురైన చిన్నారి కృష్ణవేణిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సి.పి చౌహన్ మాట్లాడుతూ.. ఈరోజు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్నారిని క్షేమంగా కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. చిన్నారి కిడ్నాప్ కి గురైనప్పటినుండి సీరియస్ గా తీసుకొని రాత్రి మొత్తం కష్టపడ్డామని తెలిపారు.

నిన్న రాత్రి నుండి రాచకొండ పోలీసులు అంతా పాప కోసం వెతకడం ప్రారంభించారని.. ఎక్కడ అనుమానం ఉంటే అక్కడికి టీం లను పంపించామని తెలిపారు. ఘట్కేసర్ గ్రామంలో ఉన్న యువకులంతా కూడా చిన్నారిని కాపాడేందుకు ఆపరేషన్ లో పాల్గొన్నారని వివరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి నేరం జరిగిన 24 గంటలలో నిందితులను పట్టుకుంటామన్నారు. మహిళా భద్రతకు సంబంధించి ఏ కేసు ఉన్న సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news