మాయమాటలు చెప్పి మభ్యపెట్టడంలో కేసీఆర్ ని మించినవారు లేరు – జీవన్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాయ మాటలు చెప్పి మభ్యపెట్టడంలో కేసీఆర్ ని మించిన వారు లేరని అన్నారు. మైనారిటీలకు ఆర్థిక సాయం 80 వేలు ఇస్తామని గతంలో జీవో ఇచ్చారని.. ఇప్పుడు లక్ష ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు. దళిత బంధు అందరికీ ఇస్తామని చెప్పి కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ బంధు ఇస్తా అన్నారు..? కానీ ఇప్పుడేమో కొన్ని కులాల వారికే సహాయం చేస్తా అంటున్నారని మండిపడ్డారు. బీసీలకు ఆర్థిక సాయం చేయని ప్రభుత్వం తెలంగాణలోనే ఉందన్నారు జీవన్ రెడ్డి. ఇప్పటివరకు దళిత బంధు, బీసీ బందు ఎంతమందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై, మహిళలకు అమలు చేసిన సంక్షేమంపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news