ఏపీలో తెలంగాణ కంటే అద్భుతమైన ఇళ్లు కట్టారు – ఎంపీ అరవింద్

-

నిజామాబాద్ లో సోమవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేయాలని బిజెపి ధర్నాకు దిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడుతూ.. కెసిఆర్ బ్రతికున్నంత కాలం ప్రజలకు ఇళ్లు రావని అన్నారు. ఏపీలో తెలంగాణ కంటే అద్భుతమైన ఇల్లు కట్టారని అన్నారు. ఏపీలో ఎనిమిది లక్షల ఇళ్లను నిర్మించారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం స్కాములు తప్ప ఏమీ చేయరని విమర్శించారు.

కేంద్రం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ డబ్బులు 30 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కి వచ్చిన పదివేల కోట్లను కవితకు ఇచ్చారని.. ఆ డబ్బును తీసుకువెళ్లి కవిత ఢిల్లీ లిక్కర్ లో పెట్టిందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పెట్టుకున్న సంబంధాలతో అక్కడికి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లాడని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరురాలు కవిత అని ఆరోపించారు అరవింద్. మహారాష్ట్రలో తిరగడానికి ఒక్కో ఎమ్మెల్యేకు 10 లక్షలు ఇస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news