పార్టీకి మించిందేది లేదు.. పార్టీనే నా శ్వాస – కిషన్ రెడ్డి

-

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా తన నియామకంపై స్పందించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని.. ఈనెల 8న వరంగల్ లో ప్రధాని మోదీ సమావేశం అనంతరం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని తెలిపారు. పార్టీకి మించింది ఏమీలేదని.. పార్టీనే నా శ్వాస అని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకి ఫోన్ చేశారని.. తెలంగాణ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారని వివరించారు.

తాను గతంలో బిజెపికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పని చేశానని, తెలంగాణ అధ్యక్షుడిగా కూడా పనిచేశానని.. మరోసారి పార్టీ తనపై ఆ బాధ్యత పెట్టిందన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని.. పార్టీని తాను ఏదీ ఎప్పుడు అడగలేదని అన్నారు. 1980 నుండి పార్టీ సైనికుడిగా పని చేశానని చెప్పుకొచ్చారు. పార్టీ నిర్ణయమే తన నిర్ణయం అని అన్నారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news