బ్రో మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రిలీజ్ చేసిన సాయి ధరమ్ తేజ్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ బ్రో.. ఇక ప్రముఖ నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో తొలిసారి మామ, మేనల్లుడు మొదటిసారి ఈ సినిమాలో అభిమానుల కోసం నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ కూడా సినిమాపై హైప్ పూర్తిగా పెంచేసాయని చెప్పాలి. ఇప్పటికే సినిమా నుంచి విడుదల అవగా సినిమాపై హైప్ పెంచుతున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందుకే అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సాయిధరమ్ తేజ్. ఇకపోతే మేకర్స్ ఆస్ట్రేలియాకు ఒక సాంగ్ షూటింగ్ నిమిత్తం వెళ్ళగా ఇక్కడ ఆ చిత్రీకరణ విజయవంతంగా కంప్లీట్ అయింది. ముఖ్యంగా ఈ షూటింగ్ తో సినిమా మొత్తం కంప్లీట్ అయింది అని తెలియజేస్తూఒక ఫోటోను తన ఇన్స్టాల్ లో షేర్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఇక ఆస్ట్రేలియాలో షూటింగ్ తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉండగా జూలై 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇకపోతే మరో రెండు మూడు రోజుల్లో మొదటి సింగిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై తెరకేక్కిస్తున్న నేపథ్యంలో సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sai Dharam Tej (@jetpanja)

Read more RELATED
Recommended to you

Latest news