సంచలన నిర్ణయానికి టైం ఉంది – జగ్గారెడ్డి

-

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ లో మొదలైన కాక కొనసాగుతూనే ఉంది. సోమవారం తాను సంచలన ప్రకటన చేయబోతున్నానని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సంచలన నిర్ణయానికి ఇంకా టైం ఉంది అన్నారు.” సంచలన నిర్ణయానికి టైం ఉంది. అది కూడా పార్టీ మంచి కోసమే ఉంటుంది. రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి.

రేవంత్ రెడ్డి, నేను గొడవ పడేది కూడా ఎత్తుగడనే అనుకోండి. మేము మేము తిట్టుకోవడం వ్యూహమే అనుకోండి. నా స్టేట్మెంట్ లతో ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. నా లైఫ్ కాంగ్రెస్ లోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాం. మొన్నటి వ్యాఖ్యలపై నో కామెంట్స్. నో కామెంట్స్ అంటే ప్రస్తుతానికి మాట్లాడను అని అర్థం. నేను ఏది మాట్లాడినా కాంగ్రెస్ ఎదుగుదల కోసమే మాట్లాడుతా. పార్టీలో ఉంటాడా.. పోతాడా అనేది మనసులో నుంచి తీసేయండి” అని జగ్గారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news