నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు – ఎమ్మెల్యే సండ్ర

-

ఖమ్మం: తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. సోమవారం సత్తుపల్లిలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. వర్షాలు కురిసి జనజీవనం అస్తవ్యస్తమైతే దానికి కారణం కెసిఆర్, కేటీఆర్ అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దానకర్ణులం అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రకృతి విపత్తుకు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి కోటి రూపాయలు తన సొంత డబ్బు సహాయం అందించారని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గతంలో టిడిపిలో ఉన్నపుడు మాట్లాడిన వీడియోలను ఇప్పుడు పెడుతున్నారని మండిపడ్డారు.

శృతి మించి విష ప్రచారం చేస్తే వారికి ఏ రీతిలో అయినా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు సండ్ర. బీజేపీలో చేరడానికి వెళ్లి యూ టర్న్ తీసుకుని కాంగ్రెస్ లో చేరినప్పటికీ.. కొంతమందికి బీజేపీ బుద్దులు అలానే ఉన్నాయన్నారు. చేసిన అభివృద్దే చెప్తామే తప్పించి ఎవరి గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news