సీఎం కేసీఆర్ పై తుమ్మల అనుచరుల ఆగ్రహం !

-

సీఎం కేసీఆర్ పై తుమ్మల నాగేశ్వర్‌ రావు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి లో తుమ్మల స్వగ్రామంలో తుమ్మలను కలిసారు పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండాలనికి చెందిన తుమ్మల అనుచరులు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర్‌ రావు కు బిఆరెస్ టిక్కెట్ నిరాకరించటంతో తుమ్మల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు వందల మంది వచ్చి తుమ్మల నాగేశ్వర్‌ రావు ను కలిసి వెళ్తున్నారు అనుచరులు. తుమ్మల నాగేశ్వర్‌ రావు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని అంటున్నారు ఆయన అనుచరులు. పాలేరు లో బంపర్ మెజారిటీ తో అభివృద్ధి ప్రదత తుమ్మలను గెలిపించుకుంటాం అంటున్నారు తుమ్మల అనుచరులు.

Read more RELATED
Recommended to you

Latest news