హైదరాబాద్​లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

-

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బక్రీద్‌ పండుగను ముస్లిం ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఈద్గాలు ఇవాళ ప్రజలతో కిటకిటలాడనున్నాయి. ఈద్గాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని మసీదులు, ఈద్గాలు, ప్రార్థనా మందిరాల వద్ద గట్టి పహారా ఏర్పాటు చేశారు. మరోవైపు బక్రీద్ సందర్భంగా ఇవాళ హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు.

ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

  • పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య ఈ రూట్లలో అనుమతిస్తారు.
  • శివరాంపల్లి, ధనమ్మ హట్స్‌ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్‌ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు.
  • ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్‌ జంక్షన్‌ వద్ద నుంచి మళ్లిస్తారు.
  • కాలాపత్తర్‌ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్‌ ఠాణా వైపు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news