కామారెడ్డిలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య..!

-

సాధారణంగా పూర్వ కాలం నుంచి ప్రేమ, ప్రేమికుల కోసం కుటుంబ తగాదాలు ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అయితే కాస్త ఎక్కువ అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మోసం చేసే వారు కొందరైతే.. ప్రేమ విఫలం అయిందని.. మరికొందరూ. ప్రేమను తమ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని ఆత్మహత్య చేసుకునే కొందరూ ఉన్నారు. కొందరూ కులం, మతం ఇలా రకరకాలుగా ప్రేమికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తాజాగా కామారెడ్డి జిల్లాలో  ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.  కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం కోనాపూర్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సాయికుమార్, వీణ లు గత కొంత కాలం గా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని వారిద్దరూ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన వీరు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డారని.. వీరి చావుకు ఇరు కుటుంబాల సభ్యులే కారణం అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వారి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకుంటే వారికి ఇలా జరిగేది కాదని పేర్కొంటున్నారు స్థానికులు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news