తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే మార్చారు. తాజాగా కూడా మరికొందరినీ బదిలీ చేశారు.

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఇన్ చార్జీ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలికి  జీహెచ్ఎంసీ కమిషనర్ గా  పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు.  దానకిషోర్ కి మూసీ రివర్ డెవలప్ ఎండీగా  బాధ్యతలను అప్పగించారు.  అలాగే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటేడ్ ఎండీగా సర్పరాజ్ అహ్మద్. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీ వాత్సవ, హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా చాహత్ బాజ్ పేయిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత త్వరలోనే బదిలీ అయిన వారు బాధ్యతలను చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news