టిఆర్ఎస్ బైక్ ర్యాలీలో ఆపశృతి

-

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ తీస్తున్న టిఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. అయితే బాణాసంచా ఉన్న ఆటో కి మంటలు అంటుకొని భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఈ ర్యాలీలో ఆటోలో ముందు భాగంలో ఆటోలో బాణాసంచాలు ఉంచారు. బాణాసంచా పేల్చుతుండగా టపాసులు ఉన్న ఆటోకి మంటలు అంటుకున్నాయి.

దీంతో ఆటోలోని బాణాసంచా మొత్తం పేలడంతో భారీ శబ్దాలు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక మంగళవారం తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీ లను ఆన్లైన్ ద్వారా సీఎం కేసీఆర్ ఒకేసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news