సింగర్ ఇండియన్ ఐడల్ శ్రీరామ్ పాటకి స్టెప్పులేసిన టిఆర్ఎస్ నేతలు

-

రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యత వేడుకలను టిఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో మంత్రులు, ఏంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు ఈ ర్యాలీలలో పాల్గొంటున్నారు. జీడిమెట్లలోని కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని మునిసిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సభకి ఉదయం 9 గంటలకి జాతీయ సమైక్యత ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో వేలాదిమందిి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం మున్సిపాలిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. ఈ సభలో ఇండియన్ ఐడల్ శ్రీరామ్ మాయదారి మైసమ్మ పాటకి స్టేజిపై స్టెప్పులేశారు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద, మరియు కార్పొరేటర్లు. నాయకులు స్టెప్పులు వేయడంతో స్టేజి వద్ద కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news