బాలు మరణంపై హరీష్ రావు , టీఆర్ఎస్ పార్టీ ఎమన్నాయంటే…!

-

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంపై యావత్ దేశం కూడా కన్నీరు పెడుతుంది. తాజాగా తెలంగాణా అధికార పార్టీ తెరాస ట్విట్టర్ వేదికగా ఎస్పీ బాలుకి నివాళి అర్పించింది. “యావత్ దేశ ప్రజలను తన గాత్రంతో మైమరపించిన గాన గంధర్వుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మరణం సంగీత లోకానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారికివే మా నివాళులు.” అని ట్వీట్ చేసింది.

మంత్రి హరీష్ రావు కూడా ట్వీట్ చేసారు. గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం. సిని లోకానికి వారు చేసిన సేవలు వెల కట్టలేనివి. అనేక భాషలలో పాటలు పాడి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చ లేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news