టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్ష రీషెడ్యూలు తప్పదా?

-

తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన నిరుద్యోగుల జీవితాలను మరింత అంధకారంలోకి నెట్టేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారి జీవితాలను గందరగోళానికి గురి చేసింది. ఈ ఘటన వల్ల కొన్ని పరీక్షలు రద్దయితే.. మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అందులో ఒకటి గ్రూప్‌-2 పరీక్ష. ఈ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ తొలుత 2023 ఆగస్టు 29, 30వ తేదీల్లో నిర్వహించాలని భావించింది.

నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3వ తేదీలకు రీ షెడ్యూల్‌ చేయగా.. నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7వ తేదీలకు పరీక్షలు రీ షెడ్యూల్‌ అయ్యాయి. అయితే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో కొత్త బోర్డు ఏర్పాటు తరువాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సినవి మరోసారి రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు రీషెడ్యూల్‌ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తదుపరి ఖాళీ తేదీలు, పరీక్ష కేంద్రాల అందుబాటు తదితర సమాచారం మేరకు కమిషన్‌ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news