BREAKING : బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ?

-

BREAKING : బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళుతున్నారని సమాచారం అందుతోంది. గత వారంలో రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేతలు అందరూ… కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో.. కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది.

తాజాగా బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళుతున్నారని సమాచారం అందుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన భార్య పద్మావతి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నారని సమాచారం. ఈ మేరకు అన్ని చర్చలు జరిగాయట. జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌ లోకి వెళ్లిన రోజే… బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారని టాక్‌. ఇది ఇలా ఉండగా, ఢిల్లీకి రావాలని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ కేంద్ర అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడంతో ఢిల్లీకి వచ్చి అమిత్ షా, జేపీ నడ్డాలను కలవాలని అధిష్టానం పిలుపు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news