ఢిల్లీకి రావాలని ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీకి రావాలని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ కేంద్ర అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడంతో ఢిల్లీకి వచ్చి అమిత్ షా, జేపీ నడ్డాలను కలవాలని అధిష్టానం పిలుపు వచ్చింది.

ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే నేపథ్యంలో… ఢిల్లీ నుంచి వీరిద్దరికీ పిలుపు వచ్చిందని సమాచారం. ఇది ఇలా ఉండగా, బిజెపిలో ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ నేత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో నేను పాల్గొన్న. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్న. పార్టీ నాయకత్వంపై నాకు అసంతృప్తి లేదు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సిలు వెంటనే విడుదల చేయాలి. తెలంగాణలో ప్రతికార రాజకీయాలు లేవు. బిఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని వాక్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news