నేడు హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్య

-

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 21న జరగనున్న యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి రంఘనాథ్ తెలిపారు. ఉపరాష్ట్రపతి సోమవారం సాయంత్రం 6 :10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి పిఎన్టి ఫ్లైఓవర్, శ్యామ్ లాల్ బిల్డింగ్, బేగంపేట్ ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ద్వారా రోడ్ నెంబర్ 29 లోని నివాసానికి చేరుకుంటారు.

మంగళవారం ఉదయం 6:20 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పంజాగుట్ట ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్, శ్యామ్ లాల్ బిల్డింగ్, ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్, రసూల్పుర సిటిఓ మీదుగా పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. 7:30 నిమిషములకు కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి నివాసానికి చేరుకుంటారు. యోగ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరవుతున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని రంగనాథ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news