క్రిమినల్ పనులు సంతోషంగా చేయడమే కేసీఆర్ పని – విజయశాంతి

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. కేసీఆర్ సర్కార్ పాలనలో లీకేజీ పేరుతో వ్యాపారం జరుగుతోందన్నారు. లీకేజీ బయటపడేసరికి మాకు సంబంధం లేదని తండ్రీకొడుకులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఒక సాధారణ ఉద్యోగులు ఛైర్మన్ చాంబర్ కు వెళ్లి లీకేజీ చేయగలరా? అది అసాధ్యం అన్నారు.

కచ్చితంగా లీకేజీ లో తండ్రీకొడుకుల పాత్ర ఉందన్నారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్… ఇల్లీగల్ గా, క్రిమినల్ పనులు సంతోషంతో చేయడమే కేసీఆర్ పని అని.. ఆయనకు కావాల్సింది లాభమేనని కీలక ఆరోపణలు చేశారు. లీకేజీతో పార్టీకి చెడ్డపేరు రావడంతో నిరుద్యోగుల ఫీజులు మాఫీ చేస్తాం, ఫ్రీ బువ్వ పెడతామంటున్నారు.. మీకేమైనా దిమాక్ ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బకొట్టిన మీరు.. నిరుద్యోగులకు ఫ్రీగా బువ్వ పెడతామంటారా? అని మండిపడ్డారు. గతంలో గ్లోబరీనా సంస్థ నిర్వాకంవల్ల చనిపోయిన పిల్లల ప్రాణాలు తీసుకొస్తారా? అని నిలదీశారు.

కేసీఆర్ పాలనలో విద్య సర్వనాశనమైందని.. 30 వేల స్కూళ్లు మూతపడ్డాయన్నారు. కేసీఆర్ కు విద్యలో, వైద్యంలో, భూముల్లో, లిక్కర్ లో కమీషన్లు కావాలని…. డబ్బు కేసీఆర్ కు పెద్ద జబ్బు అని.. వెళ్లి ఆసుపత్రిలో చెక్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైపోతుంటే తప్పించుకుని తిరుగుతున్న కేసీఆర్ కు సిగ్గు లేదన్నారు విజయశాంతి. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బండి సంజయ్ కు సిట్ నోటీసులు, లీగల్ నోటీసులిస్తారా? ఏం తప్పు చేశారు? అని ప్రశ్నించారు. ఇది కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ అన్నారు విజయశాంతి. విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులారా… మౌనం వీడండి… కదిలి రండి…పోరాడండి… బీజేపీ మీకోసం పోరాడుతోందని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news