తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

-

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది…తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ… నిన్న రాత్రి 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగిందన్నారు సీఈఓ వికాస్ రాజ్. క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి కచ్చితమైన పోలింగ్ వివరాలు అందడం వల్లే పూర్తి స్థాయి పోలింగ్ శాతం రాలేదని వివరించారు సీఈఓ వికాస్ రాజ్. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.79 శాతం నమోదు అయినట్లు వివరించారు సీఈఓ వికాస్ రాజ్. మునుగోడు 91.5, యాకత్ పురలో 39.6% పోలింగ్ జరిగిందన్నారు. మూడంచెల భద్రత స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉందని….40 కంపెనీల కేంద్ర రక్షణ బలగాలు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news