సీఎం రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విశ్వహిందూ పరిషత్ !

-

సీఎం రేవంత్ రెడ్డికి షాకిచ్చింది విశ్వహిందూ పరిషత్. సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని… ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది విశ్వహిందూ పరిషత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వంపై, హిందూ విశ్వాసాలపై, హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు, సీతలపై విమర్శలు గుప్పించడాన్ని తప్పుబట్టిన వీహెచ్‌పీ….ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలను అవమానపరిచారని వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

“విశ్వ హిందూ పరిషత్ వాళ్లు పంచిన అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి కంట్రోల్ బియ్యంతో తయారుచేసి పంచారు”అని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ,ముస్లిం, క్రైస్తవుల మెప్పు కోసం ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news