తెలంగాణలో కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తున్నాం : కిషన్ రెడ్డి

-

లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. వీటి కోసం కొత్త ఎన్నికల కమిటీని పెట్టుకోవాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని ఇవాళ మీడియా బిట్ చాట్ ధృవీకరించారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీనికి సంబంధించి ఈ నెల 7,8 తేదీల్లో సమావేశం ఉంటుందని తెలిపారు.సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అనే వార్తలు బేస్ లెస్ అంటూ కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. అలాగే మంద కృష్ణ మాదిగ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశం కూడా చర్చకు రాలేదని చెప్పారు.

ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాకు మద్దతునిచ్చిన మాట వాస్తవమే అయినా…దాని కోసం ఇప్పుడు ఆయనకు ఎంపీ సీటు ఇస్తామని అయితే కచ్చితంగా చెప్పలేమని అన్నారు. దీంతో పాటూ ఎల్సీ నేత గుఇంచి మాట్లాడారు కిషన్ రెడ్డి. మొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చినప్పుడే ఎల్పీ నేత ప్రకటన చేయాల్సి ఉంది కానీ ఆయన రావడం లేటవడంతో ఆరోజు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే పరిశీలకులు ఎల్పీ నేత పై ప్రకటన చేస్తారని తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహిళలకు, బిసిలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news