ధరణి పోర్టల్ ని రద్దు చేస్తాం – రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు హైదరాబాద్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టాలన్న సీఎం కేసీఆర్ కుట్రలో భాగమే ధరణి పోర్టల్ అని ఆరోపించారు. స్వయంగా తన భూమి రికార్డులను చెప్పడం లేదని ఆగ్రహించారు.

ధరణి రద్దు చేస్తే రైతుబంధు రద్దు అవుతుంది అని కేసిఆర్ అబద్ధాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయన్న రేవంత్ రెడ్డి.. సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి అవకాశం ఉందని వెల్లడించారు. అక్టోబర్ 2 నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news