కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం కట్టిస్తాం – రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కుటుంబంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తండ్రి, కొడుకు లకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని.. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని…కొడుకు..బిడ్డ ..కోడలు..అల్లుడు అందరూ..అందులో ఉండొచ్చంటూ ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి.

యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని.. రాజకీయ భవిష్యత్ కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని తెలిపారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక అని.. ఇందుకు ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే గారే మనకు ఉదాహరణ అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని.. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని అని ఫైర్‌ అయ్యారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అని.. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news