ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం : రేవంత్ రెడ్డి

-

అసెంబ్లీ ఎన్నికలవేళ ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని ఆరోగ్యశ్రీ పరిమితిని రూపాయలు పది లక్షలకు పెంచే మరో పథకాన్ని ఇవాళ ప్రారంభించారు సీఎం. ఆరోగ్యశ్రీ లోగో పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్ ని కట్ జేరిన్ కు రెండు కోట్ల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని.. డిసెంబర్ 9 2009లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. ఇవాళ సోనియమ్మ పుట్టిన రోజు.. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ 6 గ్యారంటీలను ఇచ్చారు. ఆరు క్యారంటీలో రెండు క్యారంటీలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news