కాలేశ్వరం అవినీతిపై ఈడి ఎందుకు రైడ్స్ చేయడం లేదు? – వైఎస్ షర్మిల

-

కాలేశ్వరం ప్రాజెక్టుపై ఈడి ఎందుకు రైడ్స్ చేయడం లేదు? అని ప్రశ్నించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. వైయస్ షర్మిల పాదయాత్ర ములుగు జిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కెసిఆర్ కు బిజెపి, కాంగ్రెస్  అమ్ముడుపోయాయని ఆరోపించారు. కెసిఆర్ అవినీతిని ప్రశ్నించేందుకే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

ఫారెస్ట్ అధికారి హత్యకు కేసిఆర్ ఏ కారణమని అన్నారు వైయస్ షర్మిల. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పోడు రైతులపై వేలాది కేసులు పెట్టారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చకుంటే కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ కు పరిపాలన చేత కాదని మండిపడ్డారు. కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే కేసిఆర్ బయటకు వస్తారని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news