ఇవాళ్టి నుంచి రెండు రోజులు వైన్‌షాపుల మూసివేత

-

తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రెండు రోజులు వైన్‌షాపులు మూసివేయనున్నారు. 13వ తేదీ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో మధ్యం అమ్మకాల పై నిషేధం విధించారు ఎన్నికల అధికారులు. దింతో ఇవాళ్టి నుండి 13 వ తేదీ వరకు మద్యం అమ్మకాల పై నిషేధం విధించారు ఎన్నికల అధికారులు.

Wine shops to be closed on tues day

ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి 13 వ తేదీ పోలింగ్ ముగిసే వరకు వైన్‌షాప్‌లు క్లోజ్ కానున్నాయి. పోలింగ్ పూర్తిగా ముగిసిన తరువాతే తెరుచుకోనున్నాయి వైన్ షాపులు. కాగా, ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది.. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది ఎన్నికల ప్రచారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news