ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు

-

ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది.. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది ఎన్నికల ప్రచారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరుగనుంది.

Today is the last day of campaigning for the fourth phase of elections

కాగా,తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడింది. ఎల్లుండి అంటే మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో… ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ క్రమంలో ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news