ఈ నెల 25న యాదాద్రికి సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ నెల 25న యాదాద్రి దేవాల‌యానికి వెళ్ల‌నున్నారు. దీని కోసం ఇప్ప‌టికే షెడ్యూల్ ఖ‌రారు కూడా అయిన‌ట్టు తెలుస్తుంది. కాగ యాదాద్రి న‌ర‌సింహ స్వామి దేవాల‌యానికి అనుబంధ ఆల‌యంగా ఉన్న ప‌ర్వ‌త‌వ‌ర్ధ‌నీ స‌మేత రామ‌లింగేశ్వ‌ర స్వామి శివాల‌యం పునః ప్రారంభానికి సిద్దం అయింది. రేప‌టి నుంచి ఐదు రోజుల పాటు మ‌హా కుంభాభిషేక మ‌హోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. 25వ తేదీన ఉద‌యం 10 : 25 గంట‌ల‌కు ఈ శివాల‌యం పునః ప్రారంభం కానుంది.

ఈ పునః ప్రారంభ ఉత్స‌వానికి సీఎం కేసీఆర్ రానున్న‌ట్టు స‌మాచారం. కాగ ఈ ఉత్స‌వాల‌ను తొగుల పీఠాధిప‌తి మాధ‌వానంద స‌ర‌స్వ‌తి స్వామి ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న‌ట్టు ఆల‌య ఈవో గీత తెలిపారు. కాగ ఇటీవల యాదాద్రి న‌ర‌సింహ స్వామి ఆల‌యాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పునః నిర్మించిన విషయం తెలిసిందే. అనంత‌రం యాదాద్రి ఆల‌యాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పుడు.. ఈ శివాలయాన్ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం పునః నిర్మించింది.

Read more RELATED
Recommended to you

Latest news