ఈ నెల 21 నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

-

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 21 నుంచి మార్చి 3 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణ సేవలను  తాత్కాలికంగా ఆలయ అధికారులు రద్దు చేశారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం అంకురారోహణ జరుగనున్నాయి. 22న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీపూజ, దేవత ఆహ్వానం, హవనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 23 నుంచి ఉదయం, రాత్రి సమయంలో వాహనసేవలు నిర్వహించనున్నారు.

 

23న మత్స్యావతార అలంకారసేవ, వేదపారాయణం, శేషవాహన సేవ జరుగనున్నది. 24న వటపత్రశాయి అలంకార సేవ, హంసవాహనసేవ, 25న శ్రీకృష్ణాలంకరణ సేవ, పొన్న వాహనసేవపై లక్ష్మీనరసింహస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. 26న గోవర్ధనగిరిధారి అలంకారసేవ, రాత్రి సింహ వాహనసేవ, 27న జగన్మోహిని అలంకారసేవ, అశ్వవాహనసేవలు, 28న ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై, రాత్రి గజవాహన సేవతో పాటు స్వామి అమ్మవార్ల తిరుకల్యాణం జరుగనున్నది.

మార్చి 1న గరుడ వాహనసేవ, దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 2న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగం, దేవతోద్వాసన, 3న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news