నిరంజన్ రెడ్డిని..చీపురు తో కొట్టండి -వైఎస్ షర్మిల

-

నిరంజన్ రెడ్డిని..చీపురు తో కొట్టండని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ గా మరో సారి విరుచుకు పడ్డారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ది రక్త చరిత్ర అని మాట్లాడాడు అంట…. వైఎస్సార్ చరిత్ర ఎంటో నిరంజన్ రెడ్డి తెలుసుకోవాలని చురకలు అంటించారు.

ఒక్క సారి కాదు…లక్షా సార్లు మాట్లాడినా అబద్ధం నిజం అవ్వదని.. వైఎస్సార్ 5 ఏళ్ల పాలన చేస్తే ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేసిన చరిత్ర అని తెలిపారు. సిగ్గుమాలిన నిరంజన్ రెడ్డి తెలుసుకో అంటూ మండిపడ్డారు.

సిగ్గు ,ఇంగితం,బుద్ది తెచ్చుకొని ప్రజల కోసం బ్రతుకు నిరంజన్ రెడ్డి…. లేకుంటే చీపురు తో కొట్టండి..కర్రు కాల్చి వాత పెట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్‌ షర్మిల. ఈయన కన్నీళ్ళ నిరంజన్ రెడ్డి.. ఈయనను మోసగాడు అనాలని.. ఈ నెల 14 న 24 గంటల పాటు పాలమూరు ప్రాజెక్ట్ కోసం నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news