చాలెంజ్ చేయడానికి అసలు ఎవడు ఈ జగ్గారెడ్డి – వైఎస్ షర్మిల

-

గత రెండు రోజులుగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు పటాన్చెరువు నియోజకవర్గం జిన్నారంలో వైయస్ షర్మిల పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మరోసారి జగ్గారెడ్డి పై మండిపడ్డారు వైయస్ షర్మిల.

ఈ బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. “ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవ్వాళ నన్ను బెదిరించాడట. ఇంకో సారి మాట్లాడితే బాగొదట. నీ ఛాలెంజ్ కి భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ. ఈ జగ్గారెడ్డి కి చెప్తున్న, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. వైఎస్సార్ చనిపోయిన రోజు మీరు పరామర్శకు వస్తే మేము రాజకీయాలు మాట్లాడామట. మేము బాద పడలేదట. ఆరోజు మా కుటుంభం లో మేము పడిన బాధ మాకేం తెలుసు. చెట్టంత మనిషిని కోల్పోతే, మా మీద తలకాయ కోల్పోతే ఎలా ఉంటుందో అలా భాద పడినం.

అసలు మేము బ్రతుకుతమ..చస్తమ అన్నట్లుగా బాద పడినం. జగ్గారెడ్డి కి ఏం తెలుసు…పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అసలు ఎవడు ఈ జగ్గారెడ్డి..ఛాలెంజ్ చేయడానికి ఎవడు. పాలమూరు ఎమ్మెల్యే లు అంతా కలిసి స్పీకర్ కి పిర్యాదు చేస్తేనే భయపడలేదు. ఒక మంత్రి నా మీద FIR ఫైల్ చేస్తే నే భయపడలేదు. అలాంటిది ఈ జగ్గారెడ్డికి వైయస్సార్ బిడ్డ భయపడుతుందా?”. అన్నారు వైయస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news