‘పప్పు ఇది చెప్పు’.. అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయింది ఎవరు? : మంత్రి రోజా

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి రోజా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించింది. వైఎస్ వివేకా హత్యతో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని గతంలోనే తిరుమల వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశానని… మీకు, మీ కుటుంబానికి సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా? అని సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

 

RK Roja Gets A Namesake Portfolio

ఈ నేపథ్యంలో ‘పప్పు ఇది చెప్పు’ అంటూ లోకేశ్ కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయింది ఎవరు? క్షుద్ర పూజలు చేయించింది ఎవరు? 40 గుడులను కూల్చేసింది ఎవరు? సదావర్తి భూములను పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు? అంతర్వేది రథాన్ని తగలబెట్టిందెవరు? రాముడి విగ్రహాన్ని విరిచేసిందెవరు? నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు? అని రోజా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news