KCRకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది : షర్మిల

-

తెలంగాణ సీఎం KCR కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని వైఎస్‌ షర్మిల హెచ్చరించారు. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొన్ని రోజులుగా తీవ్ర సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై నిన్న ఢిల్లీకి వెళ్లారు వైఎస్ షర్మిల.వ్యక్తిగత పర్యటన పేరుతో ఢిల్లీకి వెళ్లారు షర్మిల.

అయితే… కాసేపటి క్రితమే… కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా రాజశేఖర్ బిడ్డ నిరంతరాయంగా పనిచేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని వాక్యానించారు. కాంగ్రెస్ పార్టీలో YSRTP విలీనం గురించి ఎలాంటి వాక్యాలు చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news