గోరంట్ల బుచ్చయ్య ఇంటి వద్ద ఉద్రిక్తత !

-

రాజమండ్రి : టిడిపి ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య నివాసానికి టిడిపి పార్టీ అధిష్టానం నుంచి త్రిసభ్య బృందం చేరుకుంది. ఈ అధిష్టానం బృందంలో విజయవాడ తూర్పు టి.డి.పి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడా ఉన్నారు. అలగే మాజీ మంత్రులు చిన రాజప్ప జవహార్ తదితరులు ఉన్నారు.

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది టీడీపీ పార్టీ అధిష్టానం. రాజీనామా యోచన విషయంలో గోరంట్ల బుచ్చయ్య ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో గోరంట్ల నివాసానికి పెద్ద సంఖ్య లో చేరుకున్నారు అనుచరులు. అనుచరులు రావడం తో ఆయన  ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గోరంట్ల బుచ్చయ్య డిమాండ్లు పరిశీలనలోకి తీసుకుని, ఆదిరెడ్డి అప్పారావుతో విభేదాలను తొలగించేలా బృందానికి టీడీపీ హైకమాండ్ దిశా నిర్దేశం చేసింది. కాగా నిన్నటి నుంచి పార్టీ కి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news