BREAKING : బండి సంజయ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

-

కరీంనగర్‌ జిల్లా లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తం నెల కొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాగారణ దీక్షకు అనుమతి లేదని.. పోలీసులు చెబుతున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పోలీసుల కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి అరెస్ట్‌ ను అరెస్ట్‌ చేశారు కరీంనగర్‌ పోలీసులు. జీవో 317 ను సవరించాలనే డిమాండ్‌ తో… బండి సంజయ్‌ జాగరణ దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… కాసేపటి క్రితమే.. పోలీసులు ఎంటర్‌ అయ్యారు. బండి సంజయ్‌ దీక్ష కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే.. దీక్ష చేసి తీరుతామని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news