ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు ఇవే..

-

అమరావతి: ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలను విద్యాశాఖ సిద్ధం చేసింది. జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు టెన్త్ పరీక్షలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణకు ఇంటర్ బోర్డ్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. 4 వేల సెంటర్లలో టెన్త్ పరీక్షల నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ 2లోగా టెన్త్ పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమం‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదామూలపు సురేష్, తానేటి వనిత, ఇతరవున్నతాధికారులు హాజరయ్యారు. నాడు-నేడు సమీక్షలో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news