పాక్‌లో ఉగ్రదాడి… 8 మంది దుర్మరణం

-

పాకిస్థాన్ లో భారీ పేలుడు సంభవించింది. చైనాకు చెందిన ఇంజినీర్లు, పాకిస్తాన్‌ సైనికులతో వెళుతున్న బస్సులో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. ఇందులో నలుగురు ఇంజినీర్లతో సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. పలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పాకిస్థాన్‌ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన బస్సు దసూ డ్యాం వద్ద పనిచేస్తున్న చైనా ఇంజినీర్లను తీసుకుని వెళుతోంది. ఈ సమయంలో బస్సులో 30 మంది ఇంజినీర్లు, కార్మికులు ఉన్నారు. ఈ బస్సుకు పాకిస్థాన్‌ సైనికులు రక్షణను కల్పిస్తున్నారు.

అయితే.. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశా లున్నాయని తెలుస్తోంది. అయితే.. ఈ పేలుడు వెనుక ఉన్నది ఎవరనేది ఇంకా తెలియ రాలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news