KATHI MAHESH : కత్తి మహేష్ మృతిపై మంద కృష్ణ మరోసారి షాకింగ్‌ కామెంట్స్‌…

-

కత్తి మహేష్ మృతిపై మంద కృష్ణ మరోసారి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. కత్తి మహేష్ మరణం ద్వారా ఆయనికి శత్రువులు ఉన్నారని రుజువు అయ్యిందని… ఆయన చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రాణహాని లేదని చెన్నైకి తరలించారని…. రెండు కళ్ళలో ఒకటి తీసివేస్తామని మొదట చెప్పారని గుర్తు చేశారు. కళ్ళు తప్ప ఎక్కడా గాయాలు లేనప్పుడు ఎలా చనిపోయారు? అని ప్రశ్నించారు.

15 రోజులుగా సమస్య ఉత్పన్నం కానప్పుడు… ఐదు నిమిషాల ముందే ఎలా సమస్య వచ్చిందని నిలదీశారు. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ డ్రైవర్ కు చిన్న గీత పడలేదు?… ప్రాణహాని లేదంటూనే ప్రాణం ఎలా పోయింది? అని ఆగ్రహించారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బాగా ప్రచారం చేశారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసిపి గెలుపు కోసం కత్తి మహేష్ కృషి చేస్తే… ఆయన అంత్యక్రియలకు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా రాలేదని నిప్పులు చెరిగారు. మేము ఎక్కడైనా కరివేపాకులమే అని దింతో అర్థం అయ్యిందని… కత్తి మహేష్ మృతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news