AP: ” తల్లికి వందనం” నిధులలో కోత…. రూ. 2 వేలు కట్ ?

-

” తల్లికి వందనం” నిధులలో కోత విధించినట్లు సమాచారం అందుతోంది. ” తల్లికి వందనం” నిధుల విడుదలపై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం… 2025-2026 ఆర్థిక సంవత్సరానికి విధి విధానాలు ఖరారు చేసింది. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు తల్లికి వందనం నిధుల విడుదల చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్.

THALLIKI VANDHANAM
THALLIKI VANDHANAM

తల్లి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ఈ తరుణంలో నేరుగా విద్యార్థి తల్లి ఖాతాల్లో జమ చేయనుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. పాఠశాల మెయింటెనెన్స్ కోసం జిల్లా కలెక్టర్ కు రూ.2 వేలు జమ చేసింది. అయితే పాఠశాల మెయింటెనెన్స్ కోసం జిల్లా కలెక్టర్ కు జమ చేసిన రూ.2 వేలు… విద్యార్థులకు ఇచ్చే రూ.15 వేలలో నుంచి కట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అంటే తాజాగా విడుదల చేసిన జీవోలో రూ. 13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్టు ఉంది. ప్రతి విద్యార్థికి రూ. 2వేలు మినహాయింపు ఇచ్చి వాటిని స్కూళ్లు, కాలేజీల అభివృద్ధికి వినియోగించనున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news