ఇద్దరి ప్రాణాలు తీసిన గేదెలు…!

-

దరిద్రం అనేది ఏ రూపంలో వస్తుందో చెప్పలేము. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదోక ఘటన అనేది జరుగుతూనే ఉంటుంది. తాజాగా గుంటూరు జిల్లాలో గేదెలు కడగడానికి వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనం అయింది. కొల్లిపర మండలం పిడపర్తిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గేదెలను కడిగేందుకు కరకట్ట పక్కనే ఉన్న రేపల్లె డ్రైన్ లో దిగి ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు.

గేదెలను శుభ్రం చేస్తూ ప్రమాదవ శాత్తు యామినేని శ్యామ్యూల్(16), కామినేని సాయి సునీల్(19) కాలువలో పడ్డారు. నీటిలో మునిగి పోతున్న శామ్యూల్ ను రక్షించే క్రమంలో సునీల్ కూడా గల్లంతు అయ్యాడు. ఇద్దరి ఆచూకీ కోసం వెతుకుతున్న గ్రామస్తులు… పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news