బ్రేకింగ్ : బండి సంజయ్ పై పోలీస్‌ కేసు నమోదు

-

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ నల్గొండ జిల్లా పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యంలో.. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ పై కేసు నమోదు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు.

అనుమతి తీసుకోకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతం, ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగిన పర్యటన నేపద్యంలో బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటనలు, సమావేశాలు నిర్వహించవద్దని ఆయన సూచించారు. బండి సంజయ్ పర్యటన నేపధ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన బిజెపి, టిఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news