ఈ అయిదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు మనోవేదన కలిగించాయి: చంద్రబాబు

-

చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని… కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారని.. ఇక అలా ఉండదని.. మీరే ప్రత్యక్షంగా చూస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రమూ ఉండదని అన్నారు. రాజకీయ పరిపాలన సాగుతుందని వెల్లడించారు. ఎంపీలు అందరూ తరుచూ తనను వచ్చి కలవాలని, బిజీగా ఉన్నప్పటికీ మీతో మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు.

తన కోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారని ,కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదని అన్నారు.ఇకపై ప్రతి అంశాన్ని వింటానని… తానే స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎవరి పరిధిలో వారు పని చేయాలన్నారు. ఈ అయిదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు మనోవేదన కలిగించాయని చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news