వైద్యం కోసం వస్తే.. బాలిక పై కన్నేసిన డాక్టర్.. చివరికి..?

-

ఆడపిల్ల జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. సమాజంలో పెరిగిపోతున్న కామందులతో ఆడ పిల్లలకు కనీస రక్షణ లేకుండా పోతుంది. అభం శుభం తెలియని చిన్నారులు ఎంతో మంది కామాంధుల బారిన పడి చివరికి అత్యాచారాలకు గురవుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎవరి లో మార్పు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ సభ్యసమాజం తలదించుకునే మరో ఘటన జరిగింది.

ప్రజలకు వైద్యం చేసి బాధ్యతగా వ్యవహరించాల్సిన వైద్యుడు బాలికపై కన్నేసి వైద్యం పేరుతో మత్తుమందిచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కడుపు నొప్పితో బాధ పడిన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించడం తో వైద్యుడి నిర్వాకం కాస్త బయటపడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానిక మహిళలందరూ సదరు వైద్యుణ్ని దారుణంగా చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు వైద్యుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news