పల్లెలకు పాకిన ఐపీఎల్‌ బెట్టింగ్‌..పొద్దున్నే కలెక్షన్లు… ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్‌…!

-

ఐపిఎల్ సీజన్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకి పండగే. మ్యాచ్ స్టార్ట్ అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఐపిఎల్ సీజనే పెట్టుబడిగా కొంత మంది బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ యువకుల నిలువునా దోచేస్తున్నారు. క్రికెట్ అభిమానుల క్రేజ్ ని బుకీలు క్యాష్ చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రోజూ లక్షల్లో బెట్టింగులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఉన్న బుకీలతో సంబంధాలు ఏర్పరచుకుని ఆన్‌లైన్‌ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు.

చిన్నపాటి షాపు అద్దెకు తీసుకుని రోజూ క్రికెట్ మ్యాచులపై లక్షల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కమ్యునికేటర్లు, యాప్‌లను వినియోగిస్తున్నారు. ఆన్‌లైన్ నగదు లావాదేవీలకు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వాడేస్తున్నారు. పొరపాటున పోలీసులు దాడి చేసినా.. వెంటనే తప్పించుకునేందుకు బుకీలు పక్కా ప్లాన్ చేసి మరీ క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news