గుడ్డు పగిలింది…ఏపీలో అత్యధిక మెజారిటీ ఈయనకే..

-

గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది.వైఎస్ జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే… విశాఖ జిల్లా గాజువాకలో తెలుగుదేశం పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు.. మంత్రి గుడివాడ అమర్నాథ్ పై 94,058 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలో ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. ఇక అదే జిల్లాలోని భీమిలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ.

Read more RELATED
Recommended to you

Latest news